Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు ఉన్నతాధికారులకు శిక్ష

Webdunia
బుధవారం, 7 జులై 2021 (09:51 IST)
కోర్టు ధిక్కార కేసులో పంచాయతీరాజ్‌ శాఖ కమిషనరు గిరిజా శంకర్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారి, అప్పటి ఉద్యానవన శాఖ కమిషనరు చిరంజీవి చౌదరికి తొమ్మిది రోజుల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వారిద్దరూ బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో జైలుశిక్ష తీర్పును సవరించి జరిమానా విధించింది. దీనిని మూడు రోజుల్లో చెల్లించకపోతే జైలుశిక్ష అమలవుతుందని స్పష్టం చేసింది. హైకోర్టు పనివేళలు ముగిసే వరకూ కోర్టులోనే నిలబడి ఉండాలని ఆదేశిస్తూ... న్యాయమూర్తి జస్టిస్‌ బి.దేవానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్‌ను ఆ తర్వాత సవరించింది. దీనిని కృష్ణతోపాటు 35 మంది సవాల్‌చేస్తే సవరణ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం ఇవ్వాలని ఆదేశాలు అమలు కాకపోవడంతో వారంతా కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారు.

ఈ కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం హైకోర్టులో హాజరయ్యారు. అఫిడవిట్‌ దాఖలుకు సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments