తెలంగాణ హామీలు అమలు చేయండి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (18:37 IST)
రాష్ట్రపతి ప్రసంగంలో బడ్జెట్‌లో తెలంగాణ అంశాలు లేకపోవడం విచారకరమని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ జీరో హావర్‌లో ఉత్తమ్.. ఎన్నో ఆశలు, ఆశయాలతో సాధించుకున్న తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం విచారకరమని నల్గొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 
 
మంగళవారం ఆయన పార్లమెంట్ జీరో హవర్‌లో తెలంగాణ విభజన చట్టంలోని హామీలపై మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగంలో కానీ, కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కానీ తెలంగాణ హామీలపై ప్రస్తావించలేదని ఇది చాలా విచారకరమన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో ఇనుము పరిశ్రమ కానీ, గిరిజన విశ్వవిద్యాలయం కానీ ఏ ఒక్కటి అమలు కాలేదని అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు అనేక హక్కులు, హామీలు ఇచ్చారని ఐదేళ్లు అవుతున్న అవి అమలు కాలేదని వీటిపైన ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments