వైసీపీ పార్టీని ఉగ్రవాద సంస్థతో పోల్చిన పృథ్వీ

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (13:02 IST)
కమెడియన్ పృథ్వీ ప్రస్తుతం వైసీపీపై విమర్శలు చేయడం వివాదానికి దారితీసింది. వైసీసీలో చేరి ఆ పార్టీ తరుపున ప్రచారం చేసి 2014 ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న పృథ్వీ.. ప్రస్తుతం అదే పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో ఆ పార్టీ కండువా కప్పుకున్నానని చెప్పిన పృథ్వి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు.
 
పృథ్వీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంలో ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి పృథ్వీ తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ నుంచి కూడా దూరమయ్యాడు.
 
అప్పట్లో పృథ్వికి సంబంధించిన ఓ ఆడియో కాల్ సెన్సేషన్ అయింది. అయితే ఈ విషయంలో తనపై కుట్ర జరిగిందంటూ ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
 
తాజాగా ఓ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ వైసీపీ పార్టీని ఉగ్రవాద సంస్థతో పోల్చారు.. పృథ్వీ ప్రస్తుతం ఆ కామెంట్స్  రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
 
తన రాజీకీయ జీవితంలోని చాలా విషయాలపై పృథ్వి ఓపెన్ అయ్యాడు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్లుగా.. ఒకతను తన మైండ్‌ను పొల్యూట్ చేసి వైసీపీ వైపు నడిపించాడని పృథ్వి చెప్పడం గమనార్హం.
 
ఇకపోతే వైసీపీలోకి వెళ్లాక అహంకారం, కొవ్వు, మదం పట్టి నేనే టాప్ అన్నట్లుగా ఏది పడితే అది మాట్లాడేశాను అని పృథ్వి అన్నాడు. అప్పుడు అక్కడుంది పృథ్వీ కాదు.. ఒక ఉగ్రవాది అని చెబుతూనే ఆ పార్టీలో ఒక మూర్ఖుడిగా ఉండిపోయా అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం