Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖాయం : ఎంపీ విజయసాయిరెడ్డి

vijayasai reddy
, శుక్రవారం, 24 జూన్ 2022 (07:11 IST)
విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేయడం ఖాయమని, ఈ విషయంలో ఎవరు అడ్డు చెప్పినా ఆగదని ఆయన అన్నారు. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలకిందులుగా తపస్సు చేసినా విశాఖకు పరిపాలన రాజధానిని అడ్డుకోలేరన్నారు. 
 
ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ, విశాఖకు ఏపీ పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుందన్నారు. ఈ విషయంలో ఎవరు ఆపినా విశాఖకు పరిపాలన రాజధాని ఆగదన్నారు. 
 
ఇకపోతే, రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ఇచ్చే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. అణగారిన వర్గాలకు అత్యున్నత పదవులు ఇస్తామంటే ఎవరు కాదంటారని ఆయన వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలుడిని కాటేసిన పాము.. చివరికి ఏమైందంటే?