Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలుడిని కాటేసిన పాము.. చివరికి ఏమైందంటే?

Snake
, గురువారం, 23 జూన్ 2022 (20:10 IST)
పాములు ప్రమాదకరమైనవే. కాటేస్తే గంటల వ్యవధిలోనే చనిపోవడం ఖాయం. కానీ బీహార్‌లో ఓ విచిత్ర ఘటన జరిగింది. నాగు పాము కాటేసినా ఓ బాలుడికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కానీ ఆ కాటేసిన పాము మాత్రం క్షణాల్లోనే చనిపోవడం విచిత్రంగా మారింది.
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని మాధోపూర్ గ్రామానికి చెందిన అనూజ్ (4) తన మామ ఇంటికి వెళ్లాడు. బుధవారం సాయంత్రం అక్కడ పిల్లలతో ఆడుకుంటుండగా పొలం వైపు నుంచి ఓ విషపూరితమైన నాగు పాము వచ్చి పాదంపై కాటు వేసింది. 
 
అయితే అది గమనించిన స్థానికులు బాలుడి కుటుంబానికి సమాచారం అందించారు. ఆ పామును చంపడానికి దాని వెనకాల పరుగులు తీశారు. కానీ, అందరూ పాము వద్దకు చేరుకునేలోపు అది చనిపోయింది. 
 
ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబీకులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడికి చికిత్స అందించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపారు. 
 
పాము కాటుకు గురైన అనూజ్‌కు ఏమి కాకపోవడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కానీ పాము చనిపోవడం మిస్టరీగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కొత్తగా ఏడు రాష్ట్రాలు - వెల్లడించిన కర్నాటక మంత్రి