Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకాపా ఎమ్మెల్సీ హత్య చేసిన డ్రైవర్ భార్యకు ప్రభుత్వ కొలువు

Advertiesment
Aparna
, మంగళవారం, 21 జూన్ 2022 (09:21 IST)
ఇటీవల కాకినాడలో అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను కొట్టి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి మృతుని ఇంటపడేశాడు. ఈ హత్య కేసు సంచలనంగా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి మూడు రోజుల తర్వాత తాపీగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కోర్టు జ్యూడీషియల్ రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి జైలుల్లో ఉన్నాడు. 
 
అయితే, మృతుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇస్తూ కలెక్టర్‌ కృతికా శుక్లా నియామకపత్రాన్ని సోమవారం అందజేశారు. అపర్ణ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డీఎంహెచ్‌వో హనుమంతురావుకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో దంచికొడుతున్న వర్షాలు - నేడు రేపు వర్షాలు