Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిహారం ఇస్తాం రండి.. వైసీపీ నేతలకు నకిలీ లేఖలు

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (07:14 IST)
ఏపీలో అధికార పార్టీ నేతలకే టోకరా వేసేందుకు ప్లాన్ రూపొందించారు కొంతమంది. అయితే ఆ నేతలు ముందే మేల్కొనడంతో అసలు గుట్టు రట్టయింది. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ విషయమేంటంటే...

చెన్నై-వైజాగ్‌ కోస్టల్‌ కారిడార్‌ను జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారని, ఇందుకు సంబంధించి సేకరించే భూములకు ఎకరాకు రూ.25 లక్షలు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కాగితాలపూరుకు చెందిన  వైసీపీ నాయకులు  చేవూరు వెంకటేశ్వర్లు, గుమ్మా రవీంద్ర, గడ్డం రాజేష్‌కు ఉత్తరాలు వచ్చాయి.

2021లో సాగరమాల పేరుతో ఈ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెంది పార్టీకి సహకరిస్తారన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వాటిలో సూచించారు.

కోస్టల్‌ కారిడార్‌ కాలువ ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ముఖ్య నాయకులకు మాత్రమే ఈ విషయాన్ని తెలుపుతున్నామంటూ సంతకం, కింద వైసీపీ కార్యాలయం అని ఉత్తరాల్లో ఉంది. దీంతో అవాక్కైన ఆ నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కాకాణి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వాటిని పరిశీలించి ఇవి నకిలీ ఉత్తరాలని తేల్చేశారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments