మళ్లీ ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (07:03 IST)
ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ తిరిగి ప్రారంభించేందుకు 'డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆప్‌ ఇండియా (డిసిజిఐ) అనుమతించింది. ఇటీవల బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ చేపట్టిన ట్రయల్స్‌లో భాగంగా ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తాత్కాలికంగా ప్రయోగాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

అదే విధంగా వివిధ దేశాల్లోనూ తన ప్రయోగాలను నిలిపివేసింది. ఆందులో భాగంగా భారత్‌లోనూ ప్రయోగాలను నిలిపివేయాలని డిసిజిఐ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇటీవల బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తమ ప్రయోగాలను పున:ప్రారంభించింది.

దీంతో భారత్‌లోనూ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించేందుకు డిసిజిఐ డాక్టర్‌ విజి.సోమాజీ అనుమతించారు. తమ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. అయితే అత్యంత జాగ్రత్తతో ఈ ట్రయల్స్‌ను కొనసాగించాలని ఆదేశించారు. స్క్రీనింగ్‌ దశలోనే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తితే వాటిపై లోతైన అధ్యయనం చేయాలని ఈ ప్రయోగాలను చేపట్టిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ను ఆదేశించారు. అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తితే నివేదికను డిసిజిఐ కారాలయానికి సమర్పించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments