Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ దంపతులతో సీఎం జ‌గ‌న్ దంప‌తులు భేటీ

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (17:30 IST)
విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వ‌భూషణ్ హరిచందన్ దంపతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. తాజా రాజకీయ పరిస్ధితులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వివరించిన సీఎం అతిత్వరలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరిట ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గురించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి దంపతుల గౌరవార్దం గవర్నర్ దంపతులు ప్రత్యేకంగా రాజ్‌భవన్‌లో భోజన ఏర్పాట్లు చేయించారు. 
 
తొలుత రాజ్‌భవన్‌లో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జునరావు, ఇతర అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని స్వాగతించారు. గవర్నర్ శాలువా, మెమెంటోలతో సిఎంను గౌరవించగా, ముఖ్యమంత్రి సైతం అదే తీరుగా గవర్నర్‌ను సత్కరించారు. సీఎం వెంబడి ముఖ్యమంత్రి కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ తలశిల రఘురాం, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments