Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం: సీఎం జగన్

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (23:17 IST)
అబద్దాలు ఆడతారు, అసత్యాలు ప్రచారాలు చేస్తారు. వంచన కనిపిస్తుంది. ప్రతి మాటలోనూ, ప్రతి రాతలోనూ అబద్దాలతో మోసం చేసే వక్రబుద్ధే కనిపిస్తుంది. మత విద్వేషాలను కూడా రెచ్చగొచ్చడానికి ఏ మాత్రం కూడా వెనుకాడరు. కులాల మధ్య, మతాల మధ్య కూడా చిచ్చు పెడతారు. ఇష్టమొచ్చినట్లు కార్యక్రమాలు చేస్తారు అని సీఎం జగన్ అన్నారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ... వ్యవస్ధలను పూర్తిగా మేనేజ్‌ చేయబడుతున్న పరిస్థితులు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. ఏ పేదవాడికి మంచి జరుగుతున్నా ఆ మంచి జరగకూడదు, జరిగితే ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందేమోనని చెప్పి ఏకంగా ఆ మనిషిని ఆపడం కోసమని చెప్పి రక,రకాల కోర్టు కేసులు వీళ్లే వేయిస్తారు.
 
రక,రకాల వక్రీకరణ రాతలు వీళ్లే పేపర్లలో, టీవీలలో రాస్తారు, చూపిస్తారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ రెండున్నర సంవత్సరాల పరిపాలన కూడా మనస్ఫూర్తిగా, సంతృప్తినిచ్చే విధంగా చేయగలిగాను.
 
 
ఇంకా మంచి చేయడానికి కూడా వెనుకడుగు వేయను. మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేస్తానని సవినయంగా తెలియజేస్తున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments