Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ వెళ్లేందుకు ముహూర్తం ఖరారు : ఏపీ సీఎం జగన్ వెల్లడి

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (10:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేశామని, అక్కడ నుంచి పాలన సాగించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వచ్చే జూలై నుంచి విశాఖపట్టణం నుంచి పాలన సాగుతుందని చెప్పారు. 
 
ఆయన అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, జూలై నెలలో విశాఖకు తరలి వెళుతున్నామన్నారు. విశాఖ నుంచే పాలన ఉంటుందన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ వైకాపానే గెలవాలని స్పష్టం చేశారు. మీ పనితీరును గమనిస్తున్నాను.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా మనవాళ్లను గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ మంత్రివర్గ సహచరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
 
కాగా, విశాఖ నుంచి పాలన ఉంటుందని, ఏపీ రాజధాని విశాఖేనని ఢిల్లీలోనూ ఇటీవల సీఎం జగన్ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. పైగా, ఇటీవల వైజాగ్ వేదికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులోనూ ప్రకటించిన విషయం తెల్సిందే. విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎం జగన్ తమ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టుగా తాజాగా క్యాబినెట్ భేటీలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments