Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ వెళ్లేందుకు ముహూర్తం ఖరారు : ఏపీ సీఎం జగన్ వెల్లడి

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (10:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేశామని, అక్కడ నుంచి పాలన సాగించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వచ్చే జూలై నుంచి విశాఖపట్టణం నుంచి పాలన సాగుతుందని చెప్పారు. 
 
ఆయన అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, జూలై నెలలో విశాఖకు తరలి వెళుతున్నామన్నారు. విశాఖ నుంచే పాలన ఉంటుందన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ వైకాపానే గెలవాలని స్పష్టం చేశారు. మీ పనితీరును గమనిస్తున్నాను.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా మనవాళ్లను గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ మంత్రివర్గ సహచరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
 
కాగా, విశాఖ నుంచి పాలన ఉంటుందని, ఏపీ రాజధాని విశాఖేనని ఢిల్లీలోనూ ఇటీవల సీఎం జగన్ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. పైగా, ఇటీవల వైజాగ్ వేదికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులోనూ ప్రకటించిన విషయం తెల్సిందే. విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఎం జగన్ తమ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టుగా తాజాగా క్యాబినెట్ భేటీలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments