Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టీల్ ప్లాంట్‌తో జిల్లా రూపు రేఖలు మారిపోతాయ్ : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (14:02 IST)
కడప జిల్లా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ జిల్లా ప్రజల చిరాకల స్వప్నం నెరవేర్చేందుకు ఈ రోజు శ్రీకారం చుట్టామన్నారు. జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ చేసినట్టు చెప్పారు. 
 
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని, యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించాలని తన తండ్రి దివంగత వైఎస్ఆర్ కలలుకన్నారన్నారు. ఆయన మరణాంతరం ఈ ప్రాంతాన్ని ఏ ఒక్క పాలకుడూ పట్టించుకోలేదన్నారు. ఇపుడు వైఎస్ఆర్ బిడ్డగా మీ బిడ్డ అయిన తాను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంతానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయన్నారు. 
 
వైఎస్ఆర్ కలలను సాకారం చేయడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదురునిలిచి, ఇపుడు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామన్నారు. వచ్చే 24 లేదా 30 నెలల్లో ఈ ప్లాంట్ తొలి నిర్మాణం పూర్తవుతుందన్నారు. ప్లాంట్ మొదలైన అనుబంధ పరిశ్రమలు జిల్లాకు తరలివస్తాయని, జిల్లా అభివృద్దిలో ఇకపై దూసుకుని పోతుందన్నారు. ప్రారంభంలో ఈ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం 3 మిలియన్ టన్నులుగా ఉందని, భవిష్యత్‌లో ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 13 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని సీఎం జగన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments