Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతం రెడ్డి భౌతికయాన్ని చూసి సీఎం జగన్ భావోద్వేగం - సతీమణితో కన్నీటి నివాళి

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (16:25 IST)
ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతితో కలిసి కన్నీటి నివాళులు అర్పించారు. ముఖ్యగా, తన సహచరుడు, కేబినెట్ మంత్రి గౌతం రెడ్డి భౌతికకాయాన్ని చూడగానే సీఎం జగన్ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే, సీఎం జగన్‌ను చూడగానే మేకపాటి గౌతం రెడ్డి కుటుంబం బోరున విలపించింది. 
 
ఏపీ మంత్రి గౌతం రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే. ఈ మరణ వార్త తెలియగానే ఆయన ప్రత్యేక విమానంలో బెంగుళూరుకు చేరుకున్నారు. అక్కడ తన భార్యను వెంటబెట్టుకుని హైదరాబాద్ నగరానికి చేరుకుని, జూబ్లీహిల్స్‌లోని మేకపాటి గౌతం రెడ్డి నివాసానికి చేరుకుని కన్నీటి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అక్కడి మేకపాటి కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరినీ కలిచివేశాయి. 
 
సీఎం జగన్‌ను చూడగానే గౌతం రెడ్డి తల్లి బోరున విలపించారు. గౌతం రెడ్డి సతీమణి, ఆయన తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. తనను చూసిన గౌతం రెడ్డి కుటుంబ సభ్యులు బోరున విలపించడాన్ని  చూసిన జగన్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. గౌతం పార్ధివదేహం పక్కనే కుర్చీలో కూర్చొన్న జగన్ కన్నీరుకార్చారు. అలాగే, తన పక్కనే కూర్చొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని సీఎం జగన్ ఓదార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments