Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునామా మారబోతుంది...

ఠాగూర్
బుధవారం, 4 డిశెంబరు 2024 (08:43 IST)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిరునామా మారబోతుంది. గత ఐదేళ్లుగా ఆయన కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన అతిథి గృహంలో ఉంటున్నారు. అమరావతి నిర్మాణ కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటాని పలుమార్లు చెప్పిన చంద్రబాబు.. ఇటీవల రాజధాని ప్రాంతంలో ఇంటిస్థలం కొనుగోలు చేశారు. వివిధ ప్రాంతాల్లో అన్వేషించిన అనంతరం వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఆ స్థలాన్ని ఎంపిక చేశారు. 
 
25 వేల చదరపు గజాల ఈ ప్లాట్ ఈ-6 రోడ్డుకు ఆనుకుని వుంది. ఇది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ఫ్లాట్. ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించినట్టు తెలిసింది. ఈ ఫ్లాట్‌కు నాలుగు వైపులా రోడ్డు వుంది. రాజధానిలో కీలకకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా దీని పక్కనే వెళుతుంది. గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ తదితర కీలక భవనాలు ఈ ఫ్లాట్‌కు రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ఫ్లాట్‌లో కొంత విస్తీర్ణంలోనే ఇంటిని నిర్మించి, మిగిలిన స్థలాన్న ఉద్యానం, రక్షణ సిబ్బందికి గదులు వాహనాల పార్కింగ్ తదితరాలకు వినియోగించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫ్లాట్‌లో వివిధ చోట్ల మట్టి పరీక్షలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments