Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో మరో అల్పపీడనం.. 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (12:11 IST)
భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

అయితే దీని ప్రభావం దక్షిణ తమిళనాడుతో పాటు శ్రీలంక దేశంపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 
 
అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా గాలులు గంటకు 12 కిలోమీటర్లు వేగంతో వీస్తున్నాయని అధికారులు తెలిపారు.

దక్షిణ అండమాన్‌ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగనుంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆకాశంలో పూర్తిగా మేఘాలు కమ్ముకున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments