Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హస్తినకు వెళ్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (08:31 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీకి వెళుతున్నారు. జీ-20 సదస్సు వ్యూహాలు ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తిన పర్యటనకు వెళుతున్నారు. సోమవారం ఉదయం 8.45 గంటలకు ఇంటి నుంచి ఆయన బయలుదేరుతారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానంలో వెళ్లి మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరుకుంటారు. 
 
ఢిల్లీకి చేరిన తర్వాత 50 అశోక రోడ్డులోని నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుని సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌ కల్చలర్ హాలులో జరిగే ఆల్ పార్టీ మీటింగ్‌కు హాజరవుతారు. రాత్రి 7 గంటలకు తిరిగి అశోక రోడ్డులో ఉన్న నివాసానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు.
 
అలాగే, ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళుతున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీతో ఆయనకున్న వైరం కారణంగా ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments