Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హస్తినకు వెళ్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (08:31 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీకి వెళుతున్నారు. జీ-20 సదస్సు వ్యూహాలు ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తిన పర్యటనకు వెళుతున్నారు. సోమవారం ఉదయం 8.45 గంటలకు ఇంటి నుంచి ఆయన బయలుదేరుతారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానంలో వెళ్లి మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరుకుంటారు. 
 
ఢిల్లీకి చేరిన తర్వాత 50 అశోక రోడ్డులోని నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుని సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌ కల్చలర్ హాలులో జరిగే ఆల్ పార్టీ మీటింగ్‌కు హాజరవుతారు. రాత్రి 7 గంటలకు తిరిగి అశోక రోడ్డులో ఉన్న నివాసానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు.
 
అలాగే, ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళుతున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీతో ఆయనకున్న వైరం కారణంగా ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments