Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి సీఈసీ క్లాస్.. దొంగ ఓట్ల గోలేంటి?

Webdunia
బుధవారం, 12 జులై 2023 (09:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు క్లాస్ పీకారు. ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీకి పిలిపించి మరీ మందలించారు. ఈసీఐ డిప్యూటీ కమిషనర్‌తో ఏకంగా మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులతో ఇంటంటి తనిఖీలు చేపట్టాలని, ఆ సమయంలో అన్ని పార్టీలకు చెందిన నేతలు ఈ తనిఖీల్లో పాలు పంచుకునేలా చూడాలని ఆదేశించారు. 
 
ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చి కలవాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆయన మంగళవారం ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్లి... ఈసీఐ డిప్యూటీ కమిషనర్ 3 గంటలపాటు సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024 కార్యక్రమం సన్నద్ధత, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు వంటి విషయాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్ స్థాయి అధికారులను ఇంటింటికి పంపి వివరాలను తనిఖీ చేయిస్తామని తెలిపారు. అంతకుముందు రోజు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

Havish: నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరో హవీష్ చిత్రం

అనంతిక 8 వసంతాలు చేయడానికి డబ్బు అక్కర్లేదని చెప్పింది

పెద్ద హీరోలతో సినిమా కష్టమే - సినిమాల ద్వారా చాలా నష్టపోయా: శేఖర్ కమ్ముల

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments