Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలనొప్పి తట్టుకోలేక.. తొమ్మిదో అంతస్థు నుంచి దూకేసింది..

తలనొప్పి తట్టుకోలేక.. తొమ్మిదో అంతస్థు నుంచి దూకేసింది ఓ ఉద్యోగిని. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిలాంజ్ టవర్‌పై నుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపి

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (17:44 IST)
తలనొప్పి తట్టుకోలేక.. తొమ్మిదో అంతస్థు నుంచి దూకేసింది ఓ ఉద్యోగిని. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిలాంజ్ టవర్‌పై నుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మాదాపూర్ మిలాంజ్ టవర్‌ తొమ్మిదో అంతస్తులోని ప్రైమ్ ఎరా మెడికల్ టెక్నాలజీ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రావణి గురువారం కార్యాలయానికి వచ్చింది. 
 
కానీ కాసేపటికే.. బాల్కనీ వద్దకు వచ్చి ఓ స్టూల్‌ను తీసుకొని అక్కడి నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడింది. గత కొన్ని నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుండటంతో మానసిక ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. కానీ కేసు నమోదు చేసుకుని శ్రావణి ఆత్మహత్యపై పలుకోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కాగా చిత్తూరు జిల్లాకు చెందిన శ్రావణి... భర్త రామకృష్ణారెడ్డితో కలిసి మియాపూర్‌లోని మదీనాగూడలో నివాసం ఉంటుంది. శ్రావణికి ఒక బాబు కూడా ఉన్నాడు. గృహిణి అయిన శ్రావణికి వేరైమైనా సమస్యలున్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments