Webdunia - Bharat's app for daily news and videos

Install App

59వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోనలు

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (08:48 IST)
అమరావతి రాజధాని రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. 59వ రోజు మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు.

అటు వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు 59వ రోజుకు చేరాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు పెళ్లిళ్లతో పాటు ఇంటి శంకుస్థాపన కార్యక్రమాల్లోనూ ఉద్యమ నినాదం వినిపిస్తోంది. మూడు రాజధానులు వద్దు...అమరావతే ముద్దు అంటూ రైతులు, మహిళలు నినదిస్తున్నారు. 
 
తాడేపల్లిలో పంచాయతీల విలీనంపై స్టే
గుంటూరు జిల్లా తాడేపల్లి పురపాలక సంఘంలో పెనుమాక, ఉండవల్లి, ప్రాతూరు, గుండెమెడ, వడ్డేశ్వరం, ఇప్పట్నం, మల్లెంపూడి, చిర్రావూరు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో అమలును హైకోర్టు నిలుపుదల చేసింది.

అదేవిధంగా తదుపరి చర్యలన్నింటిపైనా స్టే విధించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

పైన పేర్కొన్న 8 పంచాయతీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత 6వ తేదీన జీవో 97ను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments