Webdunia - Bharat's app for daily news and videos

Install App

63వ రోజుకు రాజధాని రైతుల ఆందోళనలు

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (09:14 IST)
రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఆందోళనలు 63వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో రైతుల ధర్నా కొనసాగుతోంది.

వెలగపూడిలో 63వ రోజుకు రిలే దీక్షలు చేరుకున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు మందడం, వెలగపూడిలోనూ రైతులు 24 గంటల పాటు దీక్షకు కూర్చోనున్నారు.

మరోవైపు ఈరోజు రాజధాని గ్రామాలను జాతీయ రైతు నాయకులు సందర్శించనున్నారు. కాగా రెండు నెలలకు పైగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని పలువురు టీడీపీ నేతలు ఈ సందర్భంగా విమర్శించారు.
 
మోదీ, అమిత్‌ షా ఏం హామీ ఇచ్చారు?: సీపీఐ
సీఎం జగన్‌ ఈ నెల 12, 14 తేదీల్లో ప్రధాని మోదీ, అమిత్ షాను కలిసి ఏం చర్చించారో బయటపెట్టాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.

సమాచార చట్టం ద్వారా ఆయన  కోరారు. రాష్ట్రానికి సంబంధించి జగన్‌ ఏం విజ్ఞాపనలు ఇచ్చారు? అని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌ షా ఏం హామీ ఇచ్చారో తెలపాలన్నారు. 
 
వైసీపీ వన్‌సైడ్‌ లవ్‌: కాంగ్రెస్
బీజేపీని వైసీపీ వన్‌సైడ్‌ లవ్‌ చేస్తోందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఎద్దేవాచేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు కోసం వైసీపీ తహతహలాడుతోందని ఆరోపించారు.

కేంద్రం మెడలు వంచుతానన్న సీఎం జగన్‌ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. లోక్‌సభలో సీఏఏకు మద్దతు ఇచ్చిన వైసీపీ, రాష్ట్రంలో డ్రామాలు ఆడుతోందని తులసిరెడ్డి ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments