Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో "పేసీఎం" - ఆంధ్రప్రదేశ్‌లో 'భారతిపే'

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (19:27 IST)
కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. "పేసీఎం" అంటూ కర్నాటక వ్యాప్తంగా వెలిసిన పోస్టర్లు ఆ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేశాయి. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రతి పనికీ 40 శాతం కమీషన్లు దండుకుంటున్నారని అర్థం వచ్చేలా "పే సీఎం'' పోస్టర్లు వెలిశాయి. 
 
ఇపుడు ఇదే తరహా పోస్టర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలిశాయి. అయితే, ఇక్కడ "పే సీఎం" స్థానంలో "భారతిపే" పేరుతో వెలిశాయి. ఈ పోస్టర్లలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి ఫోటోను సైతం ముద్రించారు. 
 
ఇటీవల ఢిల్లీ రాజకీయాలను కుదిపేసిన లిక్కర్ స్కాంలో అనేక  వైకాపా నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీరిలో సీఎం సతీమణి భారతీ రెడ్డి పాత్ర కూడా ఉందన్నది ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో 'భారతిపే' పేరుతో పోస్టర్లు వెలవడం, అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను చర్చకు దారితీశాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments