Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఎలుగుబంట్లు.. ఎన్నో తెలుసా?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (23:29 IST)
లాక్ డౌన్‌తో తిరుమల గిరులు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. జనసంచారం పెద్దగా లేకపోవడంతో రోడ్లపైకి జంతువులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఘాట్ రోడ్లలో జింకలు గుంపులుగుంపులుగా తిరిగిన విషయం తెలిసిందే. ఇక పులులు కూడా తిరుమల వాసులు నివాసముండే బాలాజీనగర్ దగ్గర కనిపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
 
ఇక నిన్న పొడవైన నాగుపాము కనిపించింది. దీంతో టిటిడి ఉద్యోగులే భయంతో పరుగులు తీశారు. చివరకు పాములు పట్టే ఉద్యోగి భాస్కర్ ఆ పామును పట్టి అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు రోడ్లపై ఎలుగుబంట్ల గుంపు కనిపించింది. 
 
ఈ ఎలుగుబంట్ల గుంపు ఒకటి వెనుక మరొకటి తిరుగుతూ కనిపించాయి. ఇవి ఎటువైపు నుంచి వచ్చాయో తెలియరాలేదు. అవన్నీ గుంపులుగుంపులుగా ఉండడం.. రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ ఈ జంతువులు కనిపించాయి. దీంతో ఉదయాన్నే అటువైపుగా వెళ్ళిన కొంతమంది టిటిడి ఉద్యోగులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. అయితే అప్పటికే ఆ గుంపు అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడంతో టిటిడి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments