Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఎలుగుబంట్లు.. ఎన్నో తెలుసా?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (23:29 IST)
లాక్ డౌన్‌తో తిరుమల గిరులు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. జనసంచారం పెద్దగా లేకపోవడంతో రోడ్లపైకి జంతువులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఘాట్ రోడ్లలో జింకలు గుంపులుగుంపులుగా తిరిగిన విషయం తెలిసిందే. ఇక పులులు కూడా తిరుమల వాసులు నివాసముండే బాలాజీనగర్ దగ్గర కనిపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
 
ఇక నిన్న పొడవైన నాగుపాము కనిపించింది. దీంతో టిటిడి ఉద్యోగులే భయంతో పరుగులు తీశారు. చివరకు పాములు పట్టే ఉద్యోగి భాస్కర్ ఆ పామును పట్టి అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు రోడ్లపై ఎలుగుబంట్ల గుంపు కనిపించింది. 
 
ఈ ఎలుగుబంట్ల గుంపు ఒకటి వెనుక మరొకటి తిరుగుతూ కనిపించాయి. ఇవి ఎటువైపు నుంచి వచ్చాయో తెలియరాలేదు. అవన్నీ గుంపులుగుంపులుగా ఉండడం.. రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ ఈ జంతువులు కనిపించాయి. దీంతో ఉదయాన్నే అటువైపుగా వెళ్ళిన కొంతమంది టిటిడి ఉద్యోగులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. అయితే అప్పటికే ఆ గుంపు అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడంతో టిటిడి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments