Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్: రోడ్డుపైన తిరగవద్దన్నందుకు ఆరుగురు యువకులు వృద్ధురాలిపై కత్తులతో దాడి..

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (23:08 IST)
తిరుపతిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. రోడ్లపైన తిరగవద్దని చెప్పినందుకు ఒక వృద్ధురాలిపై కత్తులతో దాడికి దిగారు. కొర్లగుంటలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి ఎదురుగా ఒక వృద్ధురాలు కిరాణా కొట్టు నడుపుతోంది. లాక్ డౌన్ ఉన్నా ఆరుమంది యువకులు అటు ఇటూ తిరుగుతూ కనిపించారు.
 
రోడ్లపై తిరగకూడదని యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది వృద్ధురాలు. యువకులు వినిపించుకోకపోవడంతో అటువైపుగా వెళుతున్న పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో పోలీసులు యువకులను హెచ్చరించి పంపేశారు. వృద్ధురాలిపై కక్ష పెంచుకన్న యువకులు ఆమెపై దాడి చేసి గాయపరిచారు. కిరాణా కొట్టులో ఉన్న సామాన్లను ధ్వంసం చేసి అక్కడి నుంచి పారిపోయారు.
 
వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. గాయపడిన బాధితురాలి మనువడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురు యువకుల కోసం గాలిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో చాలామంది యువకులు రోడ్లపై ఆకతాయిగా తిరుగుతూ కనిపిస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేస్తూ యథావిథిగా వారు రోడ్లపైన తిరుగుతూనే ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments