Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడోసారి కూడా ఆడబిడ్డ.. భర్త ముఖం చాటేశాడు.. అమ్మేయాలనుకుంది

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (17:02 IST)
కన్నపేగునే అమ్ముకునేందుకు సిద్ధపడింది ఓ మాతృమూర్తి. బెజవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త నిరాదరణ, కుటుంబ పోషణ భారం కావడంతో ఇక దారిలేక 13 రోజుల శిశువును రూ.1.1 లక్షలకు విక్రయించింది. అయితే ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బెజవాడ, గొల్లపాలెంగట్టుకు చెందిన సాయిలక్ష్మీ అనే మహిళ తాను నవమాసాలు మోసి కన్న శిశువును అమ్మకానికి పెట్టింది. నవంబర్ 30వ తేదీన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఆడ శిశువు జన్మనిచ్చిన ఆమె.. మరో మహిళ సాయంతో హైదరాబాదుకు చెందిన వారికి 13 రోజుల పాపను రూ.1.10లక్షలకు అమ్మేయాలనుకుంది. 
 
కానీ ఈ విషయాన్ని గుర్తించిన అంగన్‌వాడీ సిబ్బంది.. చిన్నారి విక్రయాన్ని అడ్డుకుని తల్లి, మధ్యవర్తిని ఐసీడీఎస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మూడో కాన్పులోనూ ఆడపిల్లకు జన్మనివ్వడంతో భర్త మొహం చాటేశాడని.. ఇంకా పిల్లల పోషణ భారం కావడంతోనే బిడ్డను విక్రయానికి పెట్టానని ఆ తల్లి వాపోయింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments