Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడోసారి కూడా ఆడబిడ్డ.. భర్త ముఖం చాటేశాడు.. అమ్మేయాలనుకుంది

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (17:02 IST)
కన్నపేగునే అమ్ముకునేందుకు సిద్ధపడింది ఓ మాతృమూర్తి. బెజవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త నిరాదరణ, కుటుంబ పోషణ భారం కావడంతో ఇక దారిలేక 13 రోజుల శిశువును రూ.1.1 లక్షలకు విక్రయించింది. అయితే ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బెజవాడ, గొల్లపాలెంగట్టుకు చెందిన సాయిలక్ష్మీ అనే మహిళ తాను నవమాసాలు మోసి కన్న శిశువును అమ్మకానికి పెట్టింది. నవంబర్ 30వ తేదీన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఆడ శిశువు జన్మనిచ్చిన ఆమె.. మరో మహిళ సాయంతో హైదరాబాదుకు చెందిన వారికి 13 రోజుల పాపను రూ.1.10లక్షలకు అమ్మేయాలనుకుంది. 
 
కానీ ఈ విషయాన్ని గుర్తించిన అంగన్‌వాడీ సిబ్బంది.. చిన్నారి విక్రయాన్ని అడ్డుకుని తల్లి, మధ్యవర్తిని ఐసీడీఎస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మూడో కాన్పులోనూ ఆడపిల్లకు జన్మనివ్వడంతో భర్త మొహం చాటేశాడని.. ఇంకా పిల్లల పోషణ భారం కావడంతోనే బిడ్డను విక్రయానికి పెట్టానని ఆ తల్లి వాపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments