Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసాని తుఫాను ఎఫెక్టు : నేటి నుంచి 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణాల్లో వర్షాలు

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (09:38 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త సోమవారానికి తుఫానుగా మారనుంది. ప్రస్తుతం ఇది అండమాన్ సముద్ర తీరానికి దక్షిణ దిశగా ఉంది. అండమాన్ అండ్ నికోబార్ దీవుల వెంట ఉత్తర దిక్కులో కదులుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఈ నెల 21వ తేదీ నాటికి తుఫానుగా మారుతుందని, దీనికి అసానీ అనే పేరు పెట్టినట్టు ఐఎండీ వెల్లడించింది. 
 
కాగా, ఆదివారం ఉదయానికి పోర్ట్ బ్లెయిర్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం నెలకొనివుంది. మార్చి 22వ తేదీ నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలకు తాకొచ్చని ఐఎండీ తెలిపింది. దీనివల్ల అండమాన్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.  
 
ఈ తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22వ తేదీ ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని ఆనుకునివున్న ఉత్తర మయన్మార్ తీరానికి ఈ నెల 23వ తేదీకి చేరుకుంటుందని ఐఎండీ తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలగాణ రాష్ట్రాలతో పాటు యానాం, అండమాన్ నికోబార్ దీవులలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments