Webdunia - Bharat's app for daily news and videos

Install App

రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థకు మంత్రి అఖిలప్రియ అనుచరులకు లింకులున్నాయా?

క్రిష్ణానదిలో పడవ ప్రమాదం జరిగి 16 మంది ప్రాణాలు కోల్పేయిన విషయం తెలిసిందే. ఇప్పటికే 9 మంది కనిపించకుండా పోయారు. కనిపించకుండాపోయిన తమవారి కోసం బంధువులు ఎదురుచూస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థ పడవలను నదిలో నడపడమే ప్రమాద

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (19:05 IST)
క్రిష్ణానదిలో పడవ ప్రమాదం జరిగి 16 మంది ప్రాణాలు కోల్పేయిన విషయం తెలిసిందే. ఇప్పటికే 9 మంది కనిపించకుండా పోయారు. కనిపించకుండాపోయిన తమవారి కోసం బంధువులు ఎదురుచూస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థ పడవలను నదిలో నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్థారణకు వచ్చారు. 
 
అంతేకాదు 35 మందిని మాత్రమే ఎక్కించాల్సిన పడవలో 40 మందిని ఎక్కించడం, సేఫ్ జాకెట్స్ పర్యాటకులు అడిగినా ఇవ్వకపోవడంతో చాలామంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీనిపై వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి సంఘటన ఎలా జరిగిందో వివరాలను ఆరా తీయాలని పర్యాటక శాఖామంత్రి అఖిలప్రియను ఆదేశించారు.
 
భూమా అఖిల ప్రియ వెంటనే ప్రమాదంపై పర్యాటక శాఖ అధికారులను ఆరా తీశారు. రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థకు చెందిన కొండలరావు అనే వ్యక్తి అధికార తెలుగుదేశం పార్టీకి బాగా కావాల్సిన వ్యక్తి అని తేలింది. ఈయనకు భూమా అఖిలప్రియకు చెందిన కొంతమంది అనుచరులతో మంచి సంబంధాలే ఉన్నాయని సమాచారం. దీంతో ఆ విషయాన్ని మంత్రి దృష్టి తీసుకెళ్ళారట అఖిలప్రియ సన్నిహితులు. 
 
16 మంది మరణించిన తరువాత పూర్తిస్థాయిలో విచారణ తప్పదు కనుక తప్పు చేసినవారు ఎవరయినా తప్పదని మంత్రి వారికి చెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కొండలరావు ఆలోచనలో పడిపోయారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments