Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పన్ను కట్టకకపోతే తాళం వేయడంలో తప్పేముంది?

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (14:38 IST)
ఇంటిపన్ను వసూలులో పిఠాపురం మున్సిపాలిటీ అధికారులు వ్యవహారించిన తీరును ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సమర్థించారు. ఆస్తి పన్ను చెల్లించని ఇళ్ళను జప్తు చేయడంలో తప్పేముందనని ఆయన ప్రశ్నించారు. 
 
కాగా, ఏపీలోని వైకాపా ప్రభుత్వం పన్ను చెల్లించని వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఆస్తి పన్ను కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, చెత్తపన్ను కట్టలేదనే కారణంతో దుకాణాల ముందు చెత్త వేసిన ఘటన విమర్శల పాలైన విషయం తెల్సిందే. ఇపుడు పిఠాపురంలో ఇంటిపన్ను చెల్లించలేదన్న కారణంగా ఇంట్లో ఆడవాళ్లు ఉండగానే మున్సిపల్ అధికారులు ఇంటికి తాళం వేశారు. అధికారుల చర్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 
 
దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కరెంట్ బిల్లు చెల్లించకపోతే కరెంట్ తీసేస్తామని చెప్పడంలో తప్పేముందన్నారు. ఆస్తుల జప్పు అనేది ఇపుడు కొత్తగా రాలేదన్నారు. పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పడాన్ని తప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసినపుడు ఈ విధానాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన మండిపడ్డారు. పన్నులు చెల్లించకుంటే స్థానిక సంస్థలు ఎలా నడుస్తాయని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments