Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

ఠాగూర్
మంగళవారం, 1 జులై 2025 (22:22 IST)
తమపై తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపించారని, దేవుడు అన్ని చూస్తున్నాడని, అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్న వారిని ఆ దేవుడు శిక్షిస్తాడు.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అని వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. 
 
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం స్కామ్ కేసు విచారణలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో నిందితుడు వెంకటేశ్ నాయుడులను ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజులపాటు వీరిని విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
దీంతో విజయవాడ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న వీరిద్దరినీ సిట్ అధికారులు ముందుగా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీరివద్ద విచారణ జరుపుతారు. ఈ మూడు రోజుల విచారణలో లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments