Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 10 పరీక్షలు వాయిదా... విద్యాశాఖ ప్రతిపాదన.. ఆన్‌లైన్‌లో ఇంటర్నల్ మార్కులు?

Webdunia
మంగళవారం, 25 మే 2021 (15:00 IST)
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇంకో నెలపాటు పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. కరోనా కట్టడి దృష్ట్యా ఈనెల 31 వరకు కర్ఫ్యూ అమల్లో ఉండటం.. కొన్ని పాఠశాలలను ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడంతో.. పరీక్షలకు ఏర్పాట్లు చేయడం కష్టంగా మారిందని విద్యాశాఖ పేర్కొంది.
 
అలాగే.. టెన్త్ పరీక్షలపై వివిధ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను విద్యాశాఖ తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, హరియాణ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేయగా.. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గోవా, రాజస్థాన్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాలు వాయిదా విషయాన్ని ఇప్పటికే గుర్తు చేసింది. బీహార్‌, కేరళలో మాత్రం ఇప్పటికే పరీక్షలు పూర్తి అయ్యాయి.
 
ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. కాగా.. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు సీఎం కార్యాలయానికి చేరుకున్నాయి. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
 
మరోవైపు ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తే.. భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం కోసం ముందుగా అంతర్గత మార్కుల నమోదు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. మూడు, నాలుగు రోజుల్లో అంతర్గత పరీక్షల మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయాలని పాఠశాల ప్రధానోఫాధ్యాయులకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments