Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రాలో గణనీయంగా తగ్గిన పాజటివ్ కేసులు

Advertiesment
Andhra Pradesh
, సోమవారం, 24 మే 2021 (18:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. నిన్నామొన్నటివరకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ, సోమవారం ఈ కేసుల సంఖ్య 12 వేలకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 58,835 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 12,994 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,93,821కి చేరింది. తాజాగా 96 మరణాలు న‌మోద‌య్యాయి. 
 
క‌రోనా వ‌ల్ల కొత్త‌గా చిత్తూరులో 14, క‌ర్నూల్‌లో 10, విజ‌య‌న‌గ‌రంలో 10, అనంత‌పూర్‌లో 9, తూర్పుగోదావరిలో 8, విశాఖ‌ప‌ట్నంలో 8, గుంటూరులో 7, కృష్ణలో 7, నెల్లూరులో 7, శ్రీకాకుళంలో 7, ప‌శ్చిమ గోదావ‌రిలో 4, ప్రకాశంలో 3, క‌డ‌ప‌లో 2 చొప్పున మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. 
 
అలాగే, ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10,222కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 18,373 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌ బులిటెన్‌లో వెల్ల‌డించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మారిన టీకా నిబంధనలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు స్వస్తి