Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. సినిమా వాళ్లకు షాకింగ్ న్యూస్

Webdunia
బుధవారం, 7 జులై 2021 (17:49 IST)
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినీ పెద్దల డిమాండ్లను పక్కన పెడుతూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ ధరల్ని నిర్ణయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సినిమా నియంత్రం చట్టం 1955 ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
దీనిపై గతంలో పెను దుమారం రేగింది. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక ముందు వకీల్ సాబ్ సినిమా రిలీజ్‌ను అడ్డుకోడానికి ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆందోళన చెందారు. 
 
పార్టీలకు అంతీతంగా మాజీ సీఎం చంద్రబాబు, బీజేపీ నేతలు సైతం ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. అటు చిరంజీవి అధ్యక్షతను సీనీ పెద్దలు సీఎం జగన్‌కు కలిసి.. రేట్ల విషయంలో వెసులు బాటు ఇవ్వాలని కోరినట్టు కూడా ప్రచారం ఉంది. 
 
అయితే తరువాత కరోనా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లు మూతపడడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు వకీల్ సాబ్ సినిమా హిట్ అయినా.. ప్రభుత్వం నిర్ణయం కారణంగానే నష్టాలు వచ్చేయనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు మరోసారి రాజకీయ రచ్చకు దారి తీసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments