Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. సినిమా వాళ్లకు షాకింగ్ న్యూస్

Webdunia
బుధవారం, 7 జులై 2021 (17:49 IST)
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినీ పెద్దల డిమాండ్లను పక్కన పెడుతూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ ధరల్ని నిర్ణయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సినిమా నియంత్రం చట్టం 1955 ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
దీనిపై గతంలో పెను దుమారం రేగింది. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక ముందు వకీల్ సాబ్ సినిమా రిలీజ్‌ను అడ్డుకోడానికి ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆందోళన చెందారు. 
 
పార్టీలకు అంతీతంగా మాజీ సీఎం చంద్రబాబు, బీజేపీ నేతలు సైతం ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. అటు చిరంజీవి అధ్యక్షతను సీనీ పెద్దలు సీఎం జగన్‌కు కలిసి.. రేట్ల విషయంలో వెసులు బాటు ఇవ్వాలని కోరినట్టు కూడా ప్రచారం ఉంది. 
 
అయితే తరువాత కరోనా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లు మూతపడడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు వకీల్ సాబ్ సినిమా హిట్ అయినా.. ప్రభుత్వం నిర్ణయం కారణంగానే నష్టాలు వచ్చేయనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు మరోసారి రాజకీయ రచ్చకు దారి తీసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments