Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఏపీ

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (18:30 IST)
ఏపీ సర్కారు రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది జూలై 13న  పీజీ లాసెట్, జూలై 22న ఈ సెట్, 25న ICET ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది జూలై 4 నుండి 12 వరకు  EAPCET, ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది.
 
ఈ ఏడాది మార్చి 23న ఏపీ  EAPCET ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 4 నుండి 8వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. 
 
జూలై 11,12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 134 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో కూడా నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.  ఈ ఏడాది ఏప్రిల్ 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా  ఎంసెట్ ప్రవేశ పరీక్షలను విడుదల చేసింది. ఐఐటీ జేఇఇ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఎంసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments