Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీ శతాధిక నేత, మాజీ మంత్రి వెంకట్రావు ఇకలేరు

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (08:13 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూశారు. ఆయన వయసు 102 సంవత్సరాలు. సోమవారం వేకువజామున కన్నుమూశారు. గత 2004 నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈయన సొంతూరు గుంటూరు జిల్లా వేమూరి. ఈయన భార్య మంగమ్మ గత యేడాది మృతి చెందారు. కాగా, మాజీ మంత్రి వెంకట్రావు మృతిపట్ల టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, 1967లో గుంటూరు జిల్లా వేమూరి నుంచి ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. వేమూరి నుంచి మరోమారు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1978-80 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రిగా పని చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఈయన.. 1995లో గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పని చేశారు. అలాంటి సీనియర్ నేత సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments