Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీ శతాధిక నేత, మాజీ మంత్రి వెంకట్రావు ఇకలేరు

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (08:13 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూశారు. ఆయన వయసు 102 సంవత్సరాలు. సోమవారం వేకువజామున కన్నుమూశారు. గత 2004 నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈయన సొంతూరు గుంటూరు జిల్లా వేమూరి. ఈయన భార్య మంగమ్మ గత యేడాది మృతి చెందారు. కాగా, మాజీ మంత్రి వెంకట్రావు మృతిపట్ల టీడీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, 1967లో గుంటూరు జిల్లా వేమూరి నుంచి ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. వేమూరి నుంచి మరోమారు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1978-80 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రిగా పని చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఈయన.. 1995లో గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పని చేశారు. అలాంటి సీనియర్ నేత సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments