Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు - పోలీస్ శాఖకు మినహాయింపు

ఏపీలో కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు - పోలీస్ శాఖకు మినహాయింపు
, ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభంకానుంది. ఇందుకోసం ఆయా జిల్లాలకు ఉద్యోగుల పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లా, డివిజన్ స్థాయి ఉద్యోగుల వరకు మాత్రమే ఈ మార్పులు చేర్పులు చేసింది. అయితే, పోలీస్ శాఖను మాత్రం మినహాయించింది. 
 
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాలను లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన 26 జిల్లాలు ఏర్పాటుచేశారు. నిజానికి ఏపీలో 25 లోక్‌సభ స్థానాలు మాత్రమే వున్నాయి. ఆ ప్రకారంగానే జిల్లాలు ఏర్పాటు చేయాల్సివుంది. కానీ, అరకు స్థానం వైశాల్యంలో పెద్దది కావడంతో ఈ లోక్‌సభ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించారు. దీంతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. 
 
కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఏప్రిల్ 2వ తేదీ నుంచి పరిపాలనను ప్రారంభించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అదేసమయంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలనను ప్రారంచాలని స్పష్టం చేసింది. దీంతో కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపును ప్రారంభించింది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లోని పునర్‌వ్యవస్థీకరించిన ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లు పని చేయడం ప్రారంభిస్తాయని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుకారెస్ట్ నుంచి ఢిల్లీ చేరిన రెండో విమానం - సురక్షితంగా తెలుగు విద్యార్థులు