Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు: వ్యవసాయ భూమిలో 30 క్యారెట్ల వజ్రం.. విలువ రూ.2కోట్లు

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (14:00 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, దూకిలి, మహానంది, మహదేవపురం గ్రామాల్లో మంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతంలోని పొలాల్లో వర్షాల తర్వాత వజ్రాలు లభించాయి. గతేడాది 2019లో ఓ రైతు తన వ్యవసాయ భూమిలో లభించిన రూ.60 లక్షల విలువైన వజ్రాన్ని స్థానిక వ్యాపారికి మంచి మొత్తానికి విక్రయించాడు. 
 
2 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లా రైతులు 2 ఖరీదైన వజ్రాలు కనుగొని మంచి మొత్తానికి విక్రయించినట్లు కూడా చెబుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఓ రైతు తన వ్యవసాయ భూమిలో 30 క్యారెట్ల వజ్రం దొరికింది. దానిని అనంతపురం జిల్లాలోని వజ్రాల వ్యాపారికి రూ.2 కోట్లకు విక్రయించి ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఆకాశం నుంచి వజ్రాలు కురుస్తున్నాయని ప్రచారం జరిగింది. 
 
దీంతో కర్నూలు జిల్లా రైతులు తమ రోజువారీ పనులను పక్కనబెట్టి కుటుంబ సమేతంగా పొలాల్లో రాత్రింబవళ్లు వేచి ఉన్నారు. అక్కడ తాత్కాలిక టెంట్లు వేసుకుని వజ్రాలు దొరుకుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
దీనిపై సమాచారమందుకున్న రెవెన్యూశాఖ, జియోలాజికల్ సర్వేయర్లు వజ్రాలు లభించినట్లు చెబుతున్న గ్రామాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments