Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినకు వెళ్ళనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (12:46 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సోమవారం హస్తినకు వెళుతున్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర పెద్దలతో సమావేశంకానున్నారు. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
అలాగే ఈ పర్యటనలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. 
 
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంశాల కోసం మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కేంద్రం ఏమాత్రం స్పందించడం లేదు. దీంతో ఈ పర్యటనలో పోలవరం అంశాన్ని ప్రధానంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు. 
 
అలాగే, మూడు రాజధానుల అంశం, అమరావతి భవిష్యత్ గురించి కేంద్రంలోని కీలక మంత్రులతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ యేడాదిలోనే ఆయనపై ఉన్న పలు కేసుల విచారణ ప్రారంభంకానుంది. ఈ అంశంపై కూడా ఆయన హోం మంత్రి అమిత్ షా వద్ద చర్చించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments