Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో సీఎం చంద్రబాబు... నేడు ప్రధాని మోడీతో భేటీ!

ఠాగూర్
సోమవారం, 7 అక్టోబరు 2024 (09:35 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం హస్తినకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. ఈ భేటీ సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో జరుగుతుంది. ఆ తర్వాత కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమవుతారు. తన పర్యటనలో భాగంగా, రెండో రోజైన అక్టోబరు 8వ తేదీ మంగళవారం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌లతో సమావేశమవుతారు. 
 
ఇటీవల సంభవించిన విజయవాడ వరదల అనంతరం సీఎం చంద్రబాబు తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. దాంతో వరద సాయం విడుదల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, అమరావతికి వరల్డ్ బ్యాంకు నిధుల విడుదలకు ఆటంకాలు లేకుండా చూడటం తదితర అంశాలను సీఎం చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖపై విరుచుకుపడిన తెలుగు చిత్రపరిశ్రమ...

కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన మిస్టర్ సెలెబ్రిటీ ఆకట్టుకుంది : పరుచూరి వెంకటేశ్వరరావు

పవన్ గారూ.. గుడిలో ప్రసాదంతో పాటు మొక్కలు కూడా ఇవ్వండి : షాయాజీ షిండే

ఎంజీఆర్‌పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో ... జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments