Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం కట్టిన ఇళ్లకు వైకాపా స్టిక్కర్లేసారు: బాబు, మీకు నరకంలో కూడా చోటు దక్కదు: జగన్

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (20:35 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నాడు వాడివేడిగా జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్లకు డబ్బులు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం హింసిస్తోందనీ, పైగా తమ హయాంలో నిర్మించిన ఇళ్లకు వైకాపా స్టిక్కర్లు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
 
పేదలకు ఇళ్ల పంపిణీ చేసిన స్థలాలను చూస్తుంటే బాధేస్తుందన్నారు. వారికి అసైన్డ్ భూములు, ఆట స్థలాలు, శ్మశాన భూములు కేటాయిస్తున్నారనీ, అలాంటి భూములు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వానికి మనసెలా వస్తుందో అర్థం కావడంలేదన్నారు. ఇళ్ల స్థలాల వ్యవహారంలో మొత్తం 4 వేల కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు.
 
అంతకుముందు అసెంబ్లీలో పేదల ఇళ్ల స్థలాల వ్యవహారంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు ఏం మనిషో తనకు అర్థం కావడంలేదన్నారు. అన్నీ అబద్ధాలు చెపుతున్నారనీ, తాము పేదలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుంటే, అది మాట్లాడకుండూ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. నోట్లో నుంచి ప్రతిదీ అబద్దం చెపుతున్న చంద్రబాబు నాయుడుకి నరకంలో కూడా చోటు దక్కదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Durgesh: నంది అవార్డుపై చర్చ - సినిమా రంగ సమస్యలపై పాలనీ కావాలి : ఎ.పి. మంత్రి దుర్గేష్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments