Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమయం వద్దు తమ్ముళ్లూ.. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (11:29 IST)
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ కానున్న నేపథ్యంలో టీడీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు చంద్రబాబు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాతీర్పును అనుసరించి కొంతకాలం పాటు కొత్త ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయొద్దని భావించానని, అయితే పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 
తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలే లక్ష్యంగా, పార్టీ కేడర్ పైన దాడులు చేస్తూ ప్రభుత్వం ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తుందన్నారు. ఆరు నెలల పాటు ప్రభుత్వ పనితీరు చూసి సహేతుకమైన విమర్శలు చేసి, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామని అనుకున్నా కానీ ప్రభుత్వ తీరు సరిగా లేదు అని సమావేశంలో పేర్కొన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద భౌతిక దాడులు జరిగితే పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. అంతేకాదు పార్టీ తరపున ఒక టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసి కార్యకర్తల సమస్యలను పరిష్కారించాలన్నారు. కార్యకర్తల మీద దాడులు జరిగిన సందర్భాల్లో సంఘీభావ యాత్రలు చేయడం ద్వారా కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపాలన్నారు. మరి దేశం నేతలు జగన్ ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచి రివర్స్ ఎటాక్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments