Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సభాపర్వం : గవర్నర్ గో బ్యాక్.. టీడీపీ సభ్యుల నినాదాలు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (12:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ సమావేశంకాగా, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు సభలో నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 
 
అంతేకాకుండా, గవర్నర్ ప్రసంగానికి అడుగడుగా అడ్డుపడ్డారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చంపేసి గాల్లో ఎగురవేశారు. అలాగే, గవర్నర్ సభలో ప్రసంగింస్తుండగానే వారంతా సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించుకుని తిరిగి రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా, ఆయన్ను వెళ్లనీయకుండా తెదేపా సభ్యులు అడ్డుకున్నారు. దీంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేసి తెదేపా సభ్యులను పక్కకు తోసేసి గవర్నర్‌కు దారి కల్పించారు. 
 
తొలి రోజు సభలో జరిగిన పరిణామాలపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడనివ్వలేదు. కానీ, లాబీల్లో కూడా ఉండనివ్వరా అంటూ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఎమ్మెల్సీలు బీటెక్ రవితో పాటు.. మరో ఎమ్మెల్సీని కూడా మార్షల్స్ బయటకు తోసుకెళ్లారు. దీంతో మార్షల్స్‌కు టీడీపీ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments