Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఆస్తుల కేసులో మరో మలుపు

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (19:09 IST)
సీఎం జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఐఏఎస్ సివిఎస్‌కె శర్మపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వం నుండి న్యాయ సహాయం పొంది కూడా నకిలీ బిల్లులు సృష్టించి లక్షల రూపాయలు పొందారంటూ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
బిల్లుల విడుదల విషయంలో శర్మకు మాజీ సీఎస్ పీకే మహంతి, మాజీ రెవెన్యూ కార్యదర్శి పివి రమేష్ సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదుదారుడు రమణ. జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు ఐఏఎస్‌లకు అప్పటి ప్రభుత్వం న్యాయ సహాయానికి నిధులు విడుదల చేసింది. 
 
అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి సివిఎస్‌కె శర్మ ప్రభుత్వానికి న్యాయ సహాయ బిల్లులు అందజేయడంలో చేతివాటం ప్రదర్శించినట్లు, తప్పుడు బిల్లులతో లక్షల రూపాయల నిధులు విడుదల చేసినట్టు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రమణ.
 
శర్మ పెట్టిన బిల్లులను సరిగ్గా పరిశీలించకుండానే ఆనాటి సిసిఎస్ పీకే మహంతి సంతకాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు రమణ. దీనిపై అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి టి వి రమేష్ నిధులు విడుదల చేశారని ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని కోర్టును పి.వి.రమణ ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments