Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనగరం జిల్లాలో ఘోరం .. ఢీకొన్న రెండు రైళ్లు - ఆరుగురు మృతి

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2023 (21:34 IST)
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోరం జరిగింది. ఈ జిల్లాలోని కంటకాపల్లి రైల్వే జంక్షన్ వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. రాయగడ ప్యాసింజర్‌ రైలును వెనుక నుంచి పలాస ప్యాసింజర్‌ ఢీకొట్టింది. సిగ్నల్‌ కోసం ఆగిన ప్యాసింజర్‌ను పలాస ప్యాసింజర్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  దీంతో విశాఖ- రాయగడ ప్యాసింజర్‌ మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే సిబ్బంది తెలిపింది. పట్టాలు క్రాస్‌ చేస్తుండగా ఒక ట్రైన్‌ను మరో రైలు ఢీకొంది. విద్యుత్‌ వైర్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యమైంది. కొత్తవలస మండలం అలమండ - కంటకాపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ‌, జిల్లా కలెక్టర్, ఎస్సీని సంఘటన స్థలానికి హుటాహుటిన పంపించింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments