Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి?

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2023 (19:56 IST)
Bus Accident
బాపట్లలో పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా కూచిపూడి-పెదపూడి మధ్య మంగళవారంనాడు పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. 
 
అమృతలూరు మండలం కూచిపూడిలోని స్కూల్‌లో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో విద్యార్థులు పాల్గొన్న అనంతరం తిరిగి ఇంటికి బస్సులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు అంటున్నారు. 
 
ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంతలో రోడ్డు వెంట వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్కూల్ బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్ధులను బయటకు తీశాడు. ప్రమాదం జరిగిన బస్సులో 35 మంది విద్యార్థులున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments