Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి?

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2023 (19:56 IST)
Bus Accident
బాపట్లలో పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా కూచిపూడి-పెదపూడి మధ్య మంగళవారంనాడు పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. 
 
అమృతలూరు మండలం కూచిపూడిలోని స్కూల్‌లో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో విద్యార్థులు పాల్గొన్న అనంతరం తిరిగి ఇంటికి బస్సులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు అంటున్నారు. 
 
ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంతలో రోడ్డు వెంట వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్కూల్ బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్ధులను బయటకు తీశాడు. ప్రమాదం జరిగిన బస్సులో 35 మంది విద్యార్థులున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments