Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ బోర్డు సభ్యులుగా వేనాటి... సుగవాసి

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (11:46 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు సభ్యులుగా వేనాటి రామచంద్ర రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబులను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. నిజానికి తితిదే బోర్డు సభ్యులుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించినప్పటికీ ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. 
 
అలాగే, విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా బోర్డు సభ్యురాలి పదవిని సున్నితంగా తిరస్కరించింది. దీంతో వీరిద్దరి సభ్యత్వాలను దేవాదాయ శాఖ రద్దు చేసింది. అదేసమయంలో ఈ ఇద్దరి పోస్టుల స్థానంలో కొత్తవారిని నియమించింది. 
 
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రా రెడ్డి, కడప జిల్లా రాయచోటికి చెందిన సుగవాసి ప్రసాద్‌బాబులను నియమించింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో ఫ్లోర్ లీడర్‌గావున్న వేనాటి రామచంద్రా రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కడంపై సూళ్లూరుపేట టీడీపీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments