Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా 104 అంబులెన్స్‌ల కొనుగోలుకు ఏపీ సర్కారు నిర్ణయం

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (22:05 IST)
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు భారీగా 104 అంబులెన్స్‌లను కొనుగోలు చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 539 అంబులెన్స్ వాహనాల కొనుగోలుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఇందుకు రూ.89.27 కోట్ల ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక 104 అంబులెన్స్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది.
 
ఇందుకు సంబందించిన నిధులను వెంటనే విడుదల చేయాలనీ ఫైనాన్స్ శాఖను ఆదేశించారు సీఎం.. రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక అంబులెన్స్ కేటాయించాలని గతంలోనే అనుకుంది ప్రభుత్వం. 
 
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు మెరుగైన సౌకర్యాలున్న ఆసుపత్రికి తరలించేందుకు ఇవి ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది.
 
గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు సరైన రవాణా వ్యవస్థ లేక ప్రాణాలు కోల్పోతున్నారని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ఈ అంబులెన్స్ లను కొనేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments