Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బంద్ ప్రభావం : స్తంభించిన ప్రజారవాణా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన పిలుపుమేరకు

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (11:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రంలో బంద్ జరుగుతోంది. ఈ బంద్ కారణంగా గురువారం తెల్లవారుజాము నుంచే వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ఎదుటా బైఠాయించిన సీపీఐ, సీపీఎం నేతలు, బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రహదారులపై నిరసన తెలిపి ప్రైవేటు వాహనాలను కూడా ఎక్కడికక్కడ నిలిపేస్తుండటంతో జనజీవనం స్తంభించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బంద్‌కు మద్దతు పలికింది. 
 
పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగానే తమ దుకాణాలను మూసివేయగా, ప్రజలు కూడా బంద్‌లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కూడా మూతపడ్డాయి. అత్యవసర వాహనాలు మినహా మరే వాహనాలు రహదారులపై కనిపించడం లేదు. 
 
ఈ బంద్‌కు అధికార టీడీపీ కూడా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన నేతలు పలు ప్రాంతాల్లో శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. అలాగే, సినీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ కూడా ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments