Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్ననాటి స్నేహితుడితో వివాహేతర సంబంధం, భార్యకు ఎయిడ్స్ వచ్చిందనీ...

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (16:55 IST)
ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. సాఫీగా సాగిపోతున్న జీవితం. అయితే భార్య చిన్ననాటి స్నేహితుడితో శారీరక సంబంధం పెట్టుకుని తన జీవితాన్ని నిలువుగా నాశనం చేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారులు ఇప్పుడు అనాధల్లా మిగిలిపోయారు. 
 
కర్ణాటక రాష్ట్రం హవేరిజిల్లా రణబెన్నూర్ ప్రాంతానికి చెందిన నవీన్‌కి లతతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి స్వస్థలం అనంతపురంజిల్లా పుట్టపర్తి. ఉపాధి లేక బెంగుళూరుకు వలస వెళ్ళారు. వీరికి ప్రస్తుతం ఏడు సంవత్సరాల కొడుకు, ఆరు సంవత్సరాల కూతురు ఉన్నాఉ. 
 
నవీన్ సెల్ ఫోన్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. లత ఇంటి దగ్గరే ఉంటోంది. అయితే గత రెండు నెలల నుంచి అనంతపురం జిల్లా నుంచి వచ్చిన లత చిన్ననాటి స్నేహితుడు రాజేష్‌తో ఆమె ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది. లత ఇంటికి సమీపంలోనే రాజేష్ ఉండేవాడు. ఉద్యోగం కోసం బెంగుళూరుకు వచ్చాడు.
 
లతకు మాయమాటలు చెప్పి చివరకు రాజేష్ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. భార్యలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన నవీన్ ఆమెకు హెచ్ఐవి టెస్ట్ చేయించాడు. దీంతో ఆమెకు పాజిటివ్ అని వచ్చింది. కోపంతో రగిలిపోయిన నవీన్ నిన్న రాత్రి నిద్రిస్తున్న లతను అతి దారుణంగా నరికి చంపేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. తల్లి చనిపోయి, తండ్రి పరారీలో ఉండడంతో పిల్లలు అనాధలుగా మిగిలారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments