Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకవైపు సినిమా షూటింగ్.. మరోవైపు భార్యతో షికార్లు.. ఎవరు?

ఒకవైపు సినిమా షూటింగ్.. మరోవైపు భార్యతో షికార్లు.. ఎవరు?
, శనివారం, 28 నవంబరు 2020 (10:44 IST)
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'రంగ్ దే' మూవీ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నితిన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతోంది. 'తొలిప్రేమ','మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు 'వెంకీ అట్లూరి' ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 
 
సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2021 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
 
ఈ నేపథ్యంలో హీరో నితిన్ ఈ సినిమా షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ భార్యను కూడా తీసుకెళ్లాడు. ఒకవైపు షూటింగ్ మరోవైపు భార్యతో షికార్లు చేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో పెళ్ళి పీటలెక్కిన నితిన్ ప్రస్తుతం రంగ్‌దే సినిమా కోసం తన భార్యతో కలిసి దుబాయ్ చెక్కేశాడు.
 
అక్కడ స్టార్ హోటల్‌లో తన భార్యతో కలిసి దిగిన నితిన్ షూటింగ్ టైమ్‌కు సెట్‌లో అడుగుపెడుతున్నాడట. షూటింగ్ పూర్తైన వెంటనే తన భార్య షాలినితో కలిసి దుబాయ్ అంతా చుట్టేస్తున్నారట. మొత్తానికి నితిన్ ఒకేసారి అటు సినిమా పని ఇటు హనీమూన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముందు నువ్వు మారు.. నిర్మాతల్ని కాల్చుకుతిన్న నువ్వా మాట్లాడేది..?