Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి మునుగుతుందా.. నా మూడున్నరెకరాలు నీకే... బొత్సకు మహిళ సవాల్

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (15:42 IST)
ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు అమరావతి ప్రాంతానికి చెందిన ఓ మహిళ బహిరంగ సవాల్ విసిరింది. భారీ వరదలు వస్తే అమరావతి మునిగిపోతుదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ గత కొన్ని రోజులుగా ఊకదంపుడు ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే.
 
దీనిపై అమరావతికి చెందిన ఓ మహిళ బహిరంగ సవాల్ విసిరింది. రాజధాని ప్రాంతం వరదలకు మునిగిందని మంత్రి బొత్స నిరూపించగలరా? అని ప్రశ్నించారు. రాజధాని మునుగుతుందని నిరూపిస్తే.. తనకు తన పుట్టింటి వాళ్లు ఇచ్చిన మూడున్నర ఎకరాల స్థలాన్ని బొత్స సత్యనారాయణకు రాసిస్తానని సవాల్ విసిరారు. బాధ్యత గల మంత్రి బొత్స.. అమరావతి భూములు రాజధానికి అనుకూలం కాదు అని ఆనాడే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు.
 
ఇటీవల మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురిసిన వరదల కారణంగా కృష్ణానదికి భారీగా వరదలు వచ్చాయి. దీంతో అనేక లంక గ్రామాలు నీట మునిగాయి. వీటిని బూచిగా చూపి.. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాన్ని అమరావతి నుంచి దొనకొండ ప్రాంతానికి మార్చాలని వైకాపా ప్రభుత్వం భావిస్తుంటే, స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూములు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, ఇక్కడ నిర్మాణాలకు భారీ వ్యయం అవుతుందని పేర్కొన్నారు. గతంలో వచ్చిన వరదల సమయంలో అమరావతి ప్రాంతం పూర్తిగా జలమయం అయిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో మంత్రి బొత్సకు ఓ మహిళ సవాల్ విసిరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments