Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె వయస్సు 45, అతని వయస్సు 18... ఇద్దరూ కలిసి?

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. నిద్రిస్తున్న భర్తను రోకలిబండతో తలపై మోది చంపేసింది. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

Webdunia
సోమవారం, 16 జులై 2018 (17:48 IST)
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. నిద్రిస్తున్న భర్తను రోకలిబండతో తలపై మోది చంపేసింది. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
సోమల మండలం ఆవులపల్లెలో గంగాధరం, కుమారిలు నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నాడు. భర్త కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కుమారి వయస్సు 45 సంవత్సరాలు. భర్త గంగాధరం కూలి పని చేసి ఆ డబ్బు మొత్తం తాగి ఇంటికి వచ్చేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 
 
భర్తతో పూర్తిగా విసిగిపోయిన కుమారి ఇంటి పక్కనే ఉన్న ఒక యువకుడితో పరిచయం చేసుకుంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. పిల్లలు ఇంట్లో ఉండగానే యువకుడితో కలిసేది కుమారి. ఈ విషయాన్ని తండ్రికి చెప్పారు ఇద్దరు పిల్లలు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గంగాధరం ఆమెపై చేయిచేసుకున్నాడు. ఆ తర్వాత పూటుగా తాగేసి నిద్రపోయాడు. 
 
గాఢ నిద్రలోకి జారుకున్న గంగాధరం తలపై రోకలి బండతో కొట్టి చంపేసింది కుమారి. ఆ తరువాత పిల్లలను వదిలి యువకుడితో పారిపోయింది. నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments